Chandrababu: చంద్రబాబు సెక్యూరిటీలో బెల్జియం శునకం!

  • బాంబ్ స్క్వాడ్ లో మెల్నాయిస్ జాతి శునకం
  • శ్రీశైలంలో సేవలందిస్తున్న మేలుజాతి శునకం
  • చంద్రబాబు భద్రత నిమిత్తం వినియోగించడం ఇదే తొలిసారి

దట్టమైన నల్లమల పర్వతాల్లో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి నేడు ఏపీ సీఎం చంద్రబాబు వస్తుండటంతో, భారీ భద్రతా ఏర్పాట్లను చేసిన పోలీసులు, బెల్జియం నుంచి వచ్చిన మెల్నాయిస్ జాతి శునకం సేవలను బాంబ్ స్క్వాడ్ లో భాగంగా అందుకుంటున్నారు. పేలుడు పదార్థాలు ఏ రూపంలో ఉన్నా గుర్తించడంలో దీనికి మొదటి బహుమతి వచ్చింది.

 ప్రస్తుతం నెల్లూరు జిల్లా పోలీసులకు సేవలందిస్తున్న ఈ శునకాన్ని, శ్రీశైలానికి తెచ్చిన అధికారులు, హెలిప్యాడ్, చంద్రబాబు పర్యటించే ప్రాంతాల్లో తనిఖీలకు వినియోగించారు. చురుకుగా ఉండటం, తక్కువ విశ్రాంతి తీసుకుని ఎక్కువగా పనిచేయడం ఈ శునకం స్పెషాలిటీ. గత ఏప్రిల్ లో బెల్జియం నుంచి 8 శునకాలను తీసుకురాగా, వీటి సేవలను చంద్రబాబు భద్రత నిమిత్తం వినియోగించడం ఇదే తొలిసారి.

More Telugu News