kuna srisailam gowd: కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ పై కేసు నమోదు

  • శ్రీశైలం గౌడ్ పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
  • తనను దూషించాడంటూ ఫిర్యాదు చేసిన రమేష్ నాయక్
  • ఘటనపై ఇంత వరకు స్పందించని శ్రీశైలం గౌడ్

తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. రెండు రోజుల క్రితమే ఈ కేసు నమోదైనట్టు సమాచారం. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పరిధిలోని దేవేందర్ నగర్ కట్టమైసమ్మ బస్తీకి చెందిన రమేష్ నాయక్ అనే వ్యక్తి ఈ కేసు పెట్టారు. బస్తీలో అందరి ముందు శ్రీశైలం గౌడ్ తనను దూషించారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఇంతవరకు శ్రీశైలం గౌడ్ స్పందించలేదు. మరోవైపు, కేసు నమోదు చేసిన పోలీసులు త్వరలోనే శ్రీశైలంను విచారించనున్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

More Telugu News