ROBO 2: రజనీ ఫ్యాన్స్ కు చవితి కానుక.. రోబో సీక్వెల్ టీజర్ విడుదల!

  • రిలీజ్ చేసిన చిత్ర యూనిట్
  • అదరగొడుతున్న టీజర్
  • నవంబర్ లో సినిమా విడుదలకు సన్నాహాలు

సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోబో సీక్వెల్ '2.ఓ' టీజర్ ఈరోజు విడుదలైంది. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దాదాపు రూ.1,000 కోట్ల బడ్జెట్ తో శంకర్ ఈ సినిమాను ఓ విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో రజనీకాంత్ కు జోడీగా అమీజాక్సన్, ప్రతినాయకుడిగా బాలీవుడ్ హీరో అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. నవంబర్ లో రోబో సీక్వెల్ '2.ఓ'ను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ టీజర్ ను మీరూ చూసేయండి.

More Telugu News