akhil: అఖిల్ మూవీలో కీలకమైన రోల్ లో కాజల్?

  • వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'మిస్టర్ మజ్ను'
  • అఖిల్ సరసన నిధి అగర్వాల్ 
  • డిసెంబర్లో రిలీజ్ చేసే ఆలోచన

ప్రస్తుతం అఖిల్ తన మూడవ సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. గతంలో అఖిల్ చేసిన రెండు సినిమాలు ఆయనకి ఆశించిన స్థాయి విజయాన్ని అందివ్వలేకపోయాయి. అందువలన ఈ సినిమాతో తప్పకుండా ఆయనకి హిట్ ఇవ్వాలని దర్శకుడు వెంకీ అట్లూరి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. అఖిల్ ను కొత్తగా చూపించడమే కాకుండా .. కథాకథనాల్లోను కొత్తదనాన్ని చూపించే పనిలో ఆయన వున్నాడు.

నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో కాజల్ ఒక కీలకమైన రోల్ చేస్తోందనేది తాజా సమాచారం. ఆడియన్స్ ను థ్రిల్ చేయడం కోసం ఈ విషయాన్ని యూనిట్ వారు సీక్రెట్ గా వుంచినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో కాజల్ క్యారెక్టర్ ఏమై ఉంటుంది? ఆమె పాత్రను వెంకీ అట్లూరి ఎలా డిజైన్ చేసి ఉంటాడు? అనేది ఆసక్తిని రేకెత్తించే విషయమే. 'మిస్టర్ మజ్ను' టైటిల్ తో ఈ సినిమాను డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో వున్నారు.  

More Telugu News