Kerala: కేరళ వరద బాధితులకు ‘భాష్యం’ భారీ విరాళం

  • కేరళకు రూ.2 కోట్ల 7 లక్షల విరాళం
  • సీఎం చంద్రబాబుకు అందజేసిన భాష్యం రామకృష్ణ
  • అన్న క్యాంటీన్ కు రూ.27 లక్షల విరాళమిచ్చిన సాకేత్

కేరళ వరద బాధితుల కోసం సాయం అందించిన భాష్యం విద్యా సంస్థలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభినందించారు. భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ రూ.2 కోట్ల 7 లక్షల విరాళాన్ని చంద్రబాబునాయుడుకు అందజేశారు. కాగా, ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన అన్న క్యాంటీన్లకు భాష్యం రామకృష్ణ కుమారుడు సాకేత్ విరాళం అందించారు. రూ.27 లక్షల విరాళాన్ని చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా తండ్రీకొడుకులు భాష్యం రామకృష్ణ, సాకేత్ లను చంద్ర బాబు అభినందించారు.

More Telugu News