junior: జూనియర్ ఎన్టీఆర్ సినిమా వేడుకకు ఊహించని అతిథి!

  • శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న 'అరవింద సమేత'
  • ఈ నెల 20న హైదరాబాదులో ఆడియో ఫంక్షన్
  • చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్న అమితాబ్ బచ్చన్

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'అరవింద సమేత' చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. అక్టోబర్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే యోచనలో యూనిట్ సభ్యులు ఉన్నారు. మరోవైపు ఈ నెల 20వ తేదీన హైదరాబాదులోని నొవాటెల్ లో ఆడియో వేడుక నిర్వహించాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

 ఈ వేడుకకు బాలయ్య లేదా మహేష్ బాబులలో ఎవరో ఒకరు చీఫ్ గెస్ట్ గా హాజరవుతారనే వార్తలు నిన్నటిదాకా వినిపించాయి. అయితే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో అమితాబ్ కూడా ఓ ముఖ్య పాత్రను పోషించారట. అయితే, సినిమా విడుదల వరకు ఈ అంశాన్ని సీక్రెట్ గా ఉంచాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. మరి, ఇందులో ఎంత నిజం ఉందో...  వేచి చూడాల్సిందే.

More Telugu News