Jeevan Reddy: జగిత్యాలలో ఎడ్ల బండి నడిపి నిరసన తెలిపిన జీవన్‌రెడ్డి

  • బైక్‌ ర్యాలీ నిర్వహణ
  • పెట్రో ధరలు జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్‌
  • బస్‌ డిపో ఎదుట కార్యకర్తల ధర్నా

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో భారత్‌ బంద్‌ విజయవంతంగా సాగుతోంది. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి ఎడ్ల బండి నడుపుతూ తన నిరసన తెలియజేశారు. తొలుత కాంగ్రెస్‌ కార్యకర్తలు బస్‌ డిపో ఎదుట ధర్నాకు దిగారు. బస్సుల్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణం పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చి ధరలను అదుపు చేయాలని డిమాండ్‌ చేశారు. 

More Telugu News