వెలుగు నింపిన కోర్టు తీర్పు.. ప్రమాద బాధితునికి రూ.కోటి పరిహారం!

- తక్షణం చెల్లించాలని బీమా కంపెనీకి ఆదేశం
- తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో 2013 మార్చి 10న ఏక్సిడెంట్
- తీవ్రంగా గాయపడి చూపుకోల్పోయిన బాధితుడు
2013 మార్చి 10న భార్య సుమతితో కలిసి ద్విచక్ర వాహనంపై ముమ్మూర్తినగర్కు వెళుతున్నారు. అదే సమయంలో ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జయపప్రకాష్ చూపు కోల్పోయారు. దీంతో బీమా సంస్థ నుంచి పరిహారం కోరుతూ భూపతి భార్య సుమతి 2013 జూన్లో తిరుప్పూర్ జిల్లా రెండో అదనపు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. శనివారం జరిగిన లోక్ అదాలత్లో భూపతి కుటుంబ సభ్యులు, బీమా కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. చర్చల అనంతరం కోటి పరిహారం చెల్లించేందుకు కంపెనీ ముందుకు రావడంతో బాధిత కుటుంబం అంగీకరించింది.