Hyderabad: మసాజ్ పేరిట కామకలాపాలు... హైదరాబాద్ స్పాలో పట్టుబడ్డ ఐదుగురు యువతులు!

  • హైదరాబాద్ లో దాడి చేసిన ఎస్ఓటీ పోలీసులు
  • రెండు మసాజ్ సెంటర్లపై దాడులు
  • పలువురి అరెస్ట్ - కేసు నమోదు

వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి, హైదరాబాద్ లో మసాజ్ సెంటర్ పేరిట వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఓ వ్యక్తితో పాటు ఐదుగురు యువతులను హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, ఏఎస్ రావు నగర్ కు చెందిన ముంగడ హరీష్, 'స్టూడియో 11' పేరిట సెలూన్ స్పా నిర్వహిస్తున్నాడు.

 కాంట్రాక్టుపై తాను తెచ్చిన అమ్మాయిలతో ఈ సెంటర్ లో పురుషులకు మసాజ్ చేయిస్తున్నాడు. ఈ విషయమై ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఈ సెంటర్ పై దాడులు చేయగా, నిర్వాహకుడు హరీష్ తో పాటు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు యువతులు పట్టుబడ్డారు. వారి సెల్ ఫోన్లు స్వాదీనం చేసుకున్న పోలీసులు, అందరినీ కుషాయిగూడ పోలీసులకు అప్పగించారు.

కాగా, మెట్టుగూడలో 'స్టార్ స్పా సెంటర్' పేరిట గాయత్రి ప్లాజాలో నడుస్తున్న స్పాపైనా పోలీసులు దాడులు చేయగా, అక్కడ జరుగుతున్న వ్యభిచారదందా కూడా బట్టబయలైంది. ఇక్కడ బెంగళూరుకు చెందిన స్పా నిర్వాహకుడు సమీర్ అగర్వాల్ తో పాటు ఇద్దరు యువతులు, ముగ్గురు కస్టమర్లు, ఇద్దరు స్పా ఉద్యోగులు పట్టుబడ్డారు. వీరందరిపైనా కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News