Jagan: జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న నేదురుమల్లి తనయుడు!

  • ప్రస్తుతం విశాఖ జిల్లా పెందుర్తిలో పర్యటిస్తున్నజగన్ 
  • అనుచరులతో కలసి పార్టీలో చేరిన రామ్ కుమార్ 
  • చంద్రబాబు పాలనలో ప్రజలు మోసపోయారన్న నేదురుమల్లి తనయుడు  

ఎన్నికలు వస్తున్నాయంటే వలసలు సాధారణం. ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు పార్టీలు మారుతుంటారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు రామ్ కుమార్ తాజాగా వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జగన్ ప్రస్తుతం విశాఖ జిల్లా పెందుర్తిలో పర్యటిస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా రామ్ కుమార్‌ను, ఆయన అనుచరులను జగన్... కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రామ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో అనుభవం గెలిచిందని.. కానీ చంద్రబాబు పాలనలో ప్రజలు మోసపోయారని.. ఈ సారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాబట్టి జగన్‌కు అవకాశమివ్వాలని భావిస్తున్నారని తెలిపారు.

More Telugu News