కేటీఆర్ మోసం చేశారు: వరంగల్ నేత గండ్ర సత్యనారాయణరావు

- చర్చల సందర్భంగా టికెట్ ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు
- హామీ ఇవ్వడం వల్లే టీడీపీని వదిలి, టీఆర్ఎస్ లో చేరా
- స్వతంత్రంగానే బరిలోకి దిగుతున్నా
మంత్రి కేటీఆర్, ఎంపీ వినోద్ కుమార్ లతో చర్చించినప్పుడు... తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారని గండ్ర తెలిపారు. తీరా తనను మోసం చేశారని మండిపడ్డారు. మధుసూదనాచారి, రమణారెడ్డి, కీర్తిరెడ్డి వీరెవరూ స్థానికులు కాదని... తమ వ్యాపారాలను కాపాడుకోవడానికే వారు ప్రజల్లోకి వస్తున్నారని ఆరోపించారు. తాను స్వతంత్రంగానే బరిలోకి దిగుతున్నానని, ఆదివారం నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తానని, నియోజకవర్గ ప్రజలంతా తనను ఆశీర్వదించి, అవకాశం ఇవ్వాలని కోరారు.