KATTI mahesh: కత్తి మహేశ్ కు షాక్.. హైదరాబాద్ లో క్రిమినల్ కేసు నమోదు!

  • బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
  • హిందూ దేవుళ్లపై మహేశ్ అనుచిత వ్యాఖ్యలు
  • న్యాయ సలహా తీసుకున్న పోలీసులు

ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదయింది. ఓ టీవీ ఛానల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మహేశ్ మాట్లాడినట్లు హైదరాబాద్ లోని రహ్మత్ నగర్ కు చెందిన గడ్డం శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జూన్ 29న ఓ టీవీ చానల్ లో జరిగిన చర్చలో శ్రీరాముడు, సీతపై మహేశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదుపై తొలుత న్యాయ సలహా తీసుకున్న పోలీసులు.. ఐపీసీ 295(ఏ), 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాను విజయవాడకు షిఫ్ట్ అయిపోతున్నట్లు మహేశ్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

More Telugu News