Telangana: ఈ నెల 11న హైదరాబాదుకు కేంద్ర ఎన్నికల బృందం!

  • ఎన్నికల నిర్వహణ, అవసరమైన ఏర్పాట్ల పరిశీలనకు  
  • ఈ బృందానికి ఉమేశ్ సిన్హా నేతృత్వం
  • ఓ నివేదిక ఇవ్వనున్న ప్రతినిధులు

తెలంగాణ శాసనసభ రద్దయిన నేపథ్యంలో ఈ నెల 11న కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు హైదరాబాదుకు రానున్నారు. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేశ్ సిన్హా నేతృత్వంలో ఈ బృందం ఎన్నికల నిర్వహణ, అవసరమైన ఏర్పాట్లను పరిశీలించనుంది. పర్యటన అనంతరం, ఎన్నికల ఏర్పాట్లు, సాధ్యాసాధ్యాలపై ఓ నివేదిక ఇస్తుంది. 

More Telugu News