jagga reddy: సంగారెడ్డిలో ఉద్రిక్తత.. తోపులాటలో కిందపడ్డ జగ్గారెడ్డి

  • విద్యార్థి, నిరుద్యోగ ఆవేదన సభ ఉద్రిక్తం
  • ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట
  • వందల మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

సంగారెడ్డిలో నిర్వహించాలనుకున్న విద్యార్థి, నిరుద్యోగ ఆవేదన సభ ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సభకు పోలీసులు అనుమతి ఇవ్వనప్పటికీ... భారీ సంఖ్యలో విద్యార్థులు, నిరుద్యోగులు తరలి వచ్చారు. వారిని అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, నిరుద్యోగులు, కాంగ్రెస్ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో జగ్గారెడ్డి కింద పడిపోయారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డితో పాటు వందల మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ జులుం నశించాలంటూ ఈ సందర్భంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు.

More Telugu News