Rahul Gandhi: కైలాష్ మానసనరోవర్ యాత్రలో రాహుల్ గాంధీ.. తొలి ఫొటోలు, వీడియో చూడండి!

  • మీడియాకు విడుదలైన ఫొటోలు
  • తోటి ప్రయాణికులతో కలసి రాహుల్
  • తనను తాను శివుడి భక్తుడిగా పిలుచుకునే రాహుల్

హిందువులకు అత్యంత పవిత్రమైన కైలాష్ మానససరోవర్ యాత్రను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన సంగతి తెలిసిందే. తనను తాను శివుడి భక్తుడిగా పిలుచుకునే రాహుల్ యాత్రపై ఎన్నో అనుమానాలు తలెత్తాయి. ఇప్పటి వరకు ట్విట్టర్ ద్వారా ఆయన షేర్ చేసిన కొన్ని ఫొటోలు నమ్మశక్యంగా లేవనే సందేహాలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయన యాత్రకు సంబంధించిన కొన్ని ఫొటోలు విడుదలయ్యాయి. తోటి ప్రయాణికులతో కలసి రాహుల్ ఉన్న ఫొటోలను ఏఎన్ఐ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

More Telugu News