KCR: ఆ ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించని కేసీఆర్!

  • 105 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
  • సర్వేల తర్వాతే అభ్యర్థులను ఖరారు చేశామని వెల్లడి 
  • మీడియా సమావేశంలో కేసీఆర్

ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో 105 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. మేడ్చల్, మల్కాజ్‌గిరి, వరంగల్ ఈస్ట్, చొప్పదండి, వికారాబాద్ నియోజకవర్గాలకు మాత్రం అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ నియోజక వర్గాలలోని స్థానిక నేతలతో చర్చించిన అనంతరం అభ్యర్థులను ప్రకటిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. అనేక సర్వేల తర్వాత ఈ 105 స్థానాలలో అభ్యర్థులను ఖరారు చేశామని కేసీఆర్ స్పష్టం చేశారు.

More Telugu News