kct: తెలంగాణ భవన్ కు చేరుకున్న కేసీఆర్.. కాసేపట్లో టీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల?

  • కాసేపట్లో మీడియా సమావేశం
  • అసెంబ్లీ రద్దుకు గల కారణాలను వివరించనున్న కేసీఆర్ 
  • కొందరు అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీడు పెంచారు. ఈ ఉదయం నుంచి వరుస సమావేశాలు, కేబినెట్ భేటీ, అసెంబ్లీ రద్దు తీర్మానం, గవర్నర్ తో సమావేశం ఇలా ఎంతో బిజీగా ఉన్నారు. కాసేపటి క్రితమే ప్రగతి భవన్ నుంచి ఆయన తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన పాల్గొంటారు. అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలకు వెళుతుండటానికి గల కారణాలను వివరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

More Telugu News