Telangana: తెలంగాణ అసెంబ్లీ రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానం!

  •  ముగిసిన టీ-కేబినెట్ భేటీ
  • అసెంబ్లీ రద్దుకు మంత్రి వర్గం ఏక వాక్య తీర్మానం
  • రాజ్ భవన్ కు బయలుదేరిన సీఎం కేసీఆర్, మంత్రులు

హైదరాబాద్ ప్రగతిభవన్ లో జరిగిన టీ-కేబినెట్ భేటీ ముగిసింది. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ కేబినెట్ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఏక వాక్య తీర్మానంపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. సుమారు 5 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో నిర్ణయించిన సమయానికే ఈ తీర్మానంపై కేసీఆర్ సంతకం చేసినట్లు సమాచారం. ఈ తీర్మాన ప్రతిని గవర్నర్ నరసింహన్ కు సీఎం కేసీఆర్, మంత్రులు అందజేయడానికి రాజ్ భవన్ కు చేరుకున్నారు.

కాగా, తెలంగాణ అసెంబ్లీ రద్దు తీర్మానంతో రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. గవర్నర్ కు ఈ సిఫారసును సమర్పించిన అనంతరం, టీఆర్ఎస్ భవన్ లో కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని అధికారికంగా ఈ ప్రెస్ మీట్ లో కేసీఆర్ ప్రకటించనున్నారు.

More Telugu News