vennela kishore: ఎంతో విలువైన ఈ ఫొటోను ఎప్పటికీ దాచుకుంటాను: వెన్నెల కిషోర్

  • 'సాహో' సెట్ లో వెన్నెల కిషోర్
  • ప్రభాస్ తో కలిసి ఫోటో
  • రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్

మంచి పేరున్న పాత్రలు లభించడంతో టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు పొందిన వెన్నెల కిషోర్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'సాహో' చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. చిత్రానికి సంబంధించిన కామెడీ సీన్స్ చిత్రీకరించాల్సి ఉండటంతో తాజా షెడ్యుల్ లో వెన్నెల కిషోర్ జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే సెట్ లో ప్రభాస్ తో కలిసి దిగిన ఓ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

More Telugu News