kcr: ఫామ్ హౌస్ నుంచి ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఫోన్లు!

  • అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలపై వ్యూహ రచనలో కేసీఆర్ 
  • సీనియర్ నేతలతో ఫామ్ హౌస్ లో చర్చలు
  • సర్వ సన్నద్ధంగా ఉండాలంటూ ఎమ్మెల్యేలకు ఫోన్లు

అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ముమ్మరంగా వ్యూహ రచన చేస్తున్నారు. ఫామ్ హౌస్ నుంచే ఆయన వ్యూహాలను రచిస్తున్నారు. టీఆర్ఎస్ కీలక నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఫోన్లు చేశారు. సర్వ సన్నద్ధంగా ఉండాలని సూచించారు. మరోవైపు, రేపు అందరూ అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మంత్రులకు పిలుపు వెళ్లింది. రేపు అత్యంత కీలకమైన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీ అనంతరం అసెంబ్లీ రద్దుకు సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

More Telugu News