ghmc: మెరుపు సమ్మెకు దిగిన జీహెచ్ఎంసీ ఉద్యోగులు

  • కార్యాలయం ముందు బైఠాయించి, నిరసన
  • డిమాండ్లు నెరవేర్చాలంటూ నివాదాలు
  • ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగారు. జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. న్యాయమైన తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చేంత వరకు సమ్మెను విరమించబోమని స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, హౌసింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, తమకు ప్రాపర్టీ ట్యాక్స్ మాఫీ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.

More Telugu News