Congress: అలర్ట్ అయిన కాంగ్రెస్... ముఖేష్ గౌడ్ ఇంట్లో నేతల భేటీ, జానారెడ్డి గైర్హాజరు!

  • రాజకీయ పరిణామాలపై చర్చించనున్న నేతలు
  • అసెంబ్లీ రద్దయితే వ్యూహమెలా?
  • ఎన్నికలకు సిద్ధమేనంటున్న కాంగ్రెస్

తెలంగాణలో ముందస్తుకు సిద్ధమవుతున్న టీఆర్ఎస్, రేపు అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేయనుందని వస్తున్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ అలర్ట్ అయింది. నేడు ఆ పార్టీ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ ఇంట్లో పలువురు నేతలు సమావేశమై, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు.

రేపు రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలు, ఒకవేళ అసెంబ్లీ రద్దయితే, ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలన్న అంశాలపైనే ఈ చర్చ సాగనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ సమావేశానికి కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కె.జానారెడ్డి గైర్హాజరు కానున్నట్టు సమాచారం. ఆయన కంటికి ఆపరేషన్ జరగడంతో విశ్రాంతి తీసుకుంటున్నారని, అందువల్లే ఆయన ముఖేష్ గౌడ్ ఇంటికి రాబోవడం లేదని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

More Telugu News