Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సమంతకు సారీ చెబితే చాలట!
  • దర్శకుడిగా సుకుమార్ అసిస్టెంట్ 
  • మరోసారి బోల్డ్ గా 'ఆర్.ఎక్స్.100' నాయిక    

*  'ఎవరైనా సారీ చెబితే చాలు,, నా కోపం పోతుంది' అంటోంది అందాలతార సమంత. 'ఎవరైనా నాకు నచ్చని పనిచేసినప్పుడు కోపం ముంచుకొస్తుంది. అయితే, వెంటనే ఎదుటివాళ్లు సారీ చెప్పేశారనుకోండి. కరిగిపోతాను, కోపం ఎగిరిపోతుంది. అంతా ఇట్టే మర్చిపోతాను' అని చెప్పింది ఈ చెన్నయ్ బ్యూటీ.
*  ప్రముఖ దర్శకుడు సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న బుచ్చిబాబు సానా అనే కుర్రాడు దర్శకుడిగా మారుతున్నాడు. ఇతని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం ద్వారా తెలుగమ్మాయిని కథానాయికగా పరిచయం చేయడానికి క్యాస్టింగ్ కాల్ ను ఇచ్చారు.
*  ఇటీవల వచ్చిన 'ఆర్ ఎక్స్ 100' చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన కథానాయిక పాయల్ రాజ్ పుట్ తాజాగా మరో చిత్రాన్ని అంగీకరించింది. భానుశంకర్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో తాను మరోసారి బోల్డ్ పాత్రను పోషించనున్నానని పాయల్ చెప్పింది. ఈ చిత్రం షూటింగ్ ఈ నెలాఖరు నుంచి జరుగుతుంది.

More Telugu News