LG Launches Q Stylus+: ఎల్.జీ నుండి నూతన స్మార్ట్ ఫోన్ విడుదల!

  • భారత్ లో 'ఎల్ జీ క్యూ స్టైలాస్ ప్లస్' స్మార్ట్ ఫోన్ విడుదల
  • ధర రూ.21990
  • రేపటి నుండి అమ్మకాలు ప్రారంభం

సౌత్ కొరియా దిగ్గజం ఎల్ జీ తాజాగా తన నూతన స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. 'ఎల్ జీ క్యూ స్టైలాస్ ప్లస్' పేరిట 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 6.2 అంగుళాల తెరతో 18:9 నిష్పత్తిలో ప్రకాశవంతమైన రంగులను ఈ ఫోన్ కలిగి ఉంది. 3డీ సరౌండ్ సిస్టం, చేతితో రాసిన నోట్స్ ను రికార్డ్ చేయగల ఫీచర్లు ఈ ఫోన్ లో రూపొందించారు. మొరాకో బ్లూ, అరోరా బ్లాక్ రంగులలో లభ్యం అయ్యే ఈ ఫోన్ ధర రూ.21990గా నిర్ణయించారు. కాగా, రేపటి నుండి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

'ఎల్ జీ క్యూ స్టైలాస్ ప్లస్' ప్రత్యేకతలు:

  • 1080×2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 6.2" ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • వెనక భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా
  • ముందు భాగంలో 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (మెమొరీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకునే సౌకర్యం)
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌
  • 3300 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 3డీ సరౌండ్ సిస్టం

More Telugu News