Mukesh Ambani: తిరుమల వెంకన్నకు రూ. 1,11,11,111 విరాళమిచ్చిన ముఖేష్ అంబానీ

  • వెంకన్నపై భక్తిని మరోసారి చాటుకున్న ముఖేష్ అంబానీ
  • వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు విరాళం
  • దాతల విభాగానికి అందజేత

రిలయన్స్ గ్రూప్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ, మరోసారి తిరుమల శ్రీ వెంకటేశ్వరునిపై తనకున్న భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఆయన రూ. 1,11,11,111 మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు ఈ విరాళాన్ని అందించి, ప్రాణాపాయంలో ఉన్న రోగుల ప్రాణాలు కాపాడాలని ఆయన కోరారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధి ఒకరిని తిరుమలకు పంపించి, విరాళాన్ని అందించారు. తిరుమలలోని దాతల విభాగంలో ఈ విరాళం చెక్కును అధికారులు స్వీకరించారు. గతంలోనూ ముఖేష్ అంబానీ పలుమార్లు వెంకటేశ్వరునికి కోట్లాది రూపాయలను విరాళంగా సమర్పించిన సంగతి తెలిసిందే.

More Telugu News