pragathi nivedana sabha: కేసీఆర్ మరో పదేళ్లు సీఎంగా ఉండాలి : కేకే

  • ఈ ప్రభుత్వం బీసీలకు అంకితం
  • ప్రజాస్వామ్యంలో నిజమైన రాజులు ప్రజలే
  • ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ తమ పార్టీకి ఉంటాయి

ప్రజాస్వామ్యంలో నిజమైన రాజులు ప్రజలేనని టీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు (కేకే) అన్నారు. కొంగరకలాన్ లో జరుగుతున్న ప్రగతి నివేదన సభలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం బీసీలకు అంకితమని, కేసీఆర్ మరో పదేళ్లు సీఎంగా ఉంటే బంగారు తెలంగాణ, నిజమైన స్వర్గ తెలంగాణ సాధ్యమని అభిప్రాయపడ్డారు.

 ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ తమ పార్టీకి ఉంటాయనే నమ్మకం తనకు ఉందని అన్నారు. వాస్తవానికి తెలంగాణలో సాధించిన అభివృద్ధి రెండేళ్లలోనేనని నాలుగేళ్లలో కాదని అన్నారు. అంతకుముందు, మంత్రి మహేందర్ రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. ప్రగతి నివేదన సభ ద్వారా టీఆర్ఎస్ పాలనలో సాధించిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు.

More Telugu News