pragathi nivedana sabha: హైదరాబాదుకు వచ్చిన ట్రాక్టర్లన్నీ ఈ రాత్రికి ఇక్కడే: డీజీపీ

  • ట్రాక్టర్లన్నీ రేపు ఉదయం వెళ్లాలి
  • ముందు ప్రకటించిన రూట్లోనే అందరూ వెళ్లాలి
  • ట్రాఫిక్ కు అంతరాయం కల్పించవద్దు

ప్రగతి నివేదన సభకు వచ్చిన ట్రాక్టర్లన్నింటినీ ఈ రాత్రికి ఇక్కడే ఉంచుతామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. రేపు ఉదయం వాటిని పంపిస్తామని చెప్పారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సభ పూర్తయిన తర్వాత ముందు ప్రకటించిన రూట్లలోనే వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగేలా ఎవరూ ప్రవర్తించవద్దని కోరారు. సభ పూర్తయిన తర్వాత అందరూ క్షేమంగా తమ స్వస్థలాలకు చేరుకోవాలని చెప్పారు. 

More Telugu News