Telangana: ఈ నెల 4లోపు ఆయా శాఖల ప్రతిపాదనలు పంపాలి: టీ-సీఎస్ ఆదేశాలు

  • మరోసారి మంత్రివర్గ భేటీ 
  • అన్ని శాఖలను కోరిన సాధారణ పరిపాలన శాఖ
  • ఈ మేరకు తెలంగాణ సీఎస్ ఆదేశాలు

ఈ రోజు జరిగిన టీ-కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. త్వరలోనే మరోసారి మంత్రి వర్గ భేటీ ఉంటుందని సమావేశం అనంతరం మంత్రులు కడియం, ఈటల రాజేందర్, హరీశ్ రావు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా శాఖలు తమ ప్రతిపాదనలు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ అన్ని శాఖలను కోరింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 4న మధ్యాహ్నం మూడు గంటలలోపు ఆయా శాఖలు తమ ప్రతిపాదనలు ఇవ్వాలని పేర్కొన్నారు. 

More Telugu News