TRS: ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. మరికాసేపట్లో మీడియా ముందుకు కేసీఆర్!

  • పూర్తయిన కేబినెట్ భేటీ
  • కీలక ప్రతిపాదనకు ఆమోదం
  • ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు

కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ప్రగతి భవన్ లో సమావేశం పూర్తయిన నేపథ్యంలో కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాల ప్రకటన, మధ్యంతర భృతి, ముందస్తు ఎన్నికలపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెబుతారని వార్తలు వస్తున్నాయి. పలు సంక్షేమ పథకాలపై కూడా గతంలో వేర్వేరు మంత్రిత్వశాఖలు చేసిన ప్రతిపాదనలను ఈ భేటీలో కేబినెట్ ఆమోదించినట్లు తెలుస్తోంది.

More Telugu News