Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • కాస్త స్పీడ్ తగ్గిస్తానంటోన్న రకుల్ ప్రీత్! 
  • ఆడియో వేడుకలో రెహ్మాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ 
  • సుధీర్ బాబు సినిమా రిలీజ్ వాయిదా

*  'ఇకపై స్పీడ్ కాస్త తగ్గిస్తా' అంటోంది కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. గతంలో ఏది వస్తే ఆ సినిమాను చేసేశాను. దీని వల్ల సంఖ్య పెరిగింది. అయితే, ఇప్పుడలా కాదు, సెలక్టివ్ గా ఉంటున్నాను. మంచి సినిమా అనిపించిన వాటినే చేస్తున్నాను దీని వల్ల తృప్తి వుంటుంది' అని చెప్పింది రకుల్.
*  ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న 'చెక్క చివంతం వానం' (తెలుగులో నవాబ్) చిత్రం ఆడియో వేడుక ఈ నెల 5న చెన్నయ్ లో జరగనుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ఈ చిత్రంలోని పాటలతో కూడిన లైవ్ పెర్ఫార్మెన్స్ ను ఆ నాటి వేడుకలో ఇస్తాడట.
*  సుధీర్ బాబు నటించిన 'నన్ను దోచుకుందువటే' చిత్రం విడుదల వాయిదా పడింది. ఈ నెల 13న విడుదల కావలసిన ఈ చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. నూతన దర్శకుడు ఆర్ఎస్ నాయుడు దీనికి దర్శకత్వం వహించాడు. 

More Telugu News