asia cup: కోహ్లీకి విశ్రాంతి... ఆసియా కప్ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లు వీరే!

  • ఈ నేల 15 నుంచి 28వ తేదీ వరకు ఆసియా కప్
  • రోహిత్ శర్మకు కెప్టెన్సీ
  • స్థానం దక్కించుకున్న అంబటి రాయుడు

ఈనెల 15వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆసియా కప్ జరగనుంది. దుబాయ్, అబుదాబీల్లో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఈ కప్ లో పాల్గొనే ఆటగాళ్ల పేర్లను బీసీసీఐ ప్రకటించింది. వరుసగా మ్యాచ్ లు ఆడుతున్న కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. విరాట్ స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. రోహిత్ కు డిప్యూటీగా శిఖర్ ధావన్ ను ఎంపిక చేవారు. అంబటి రాయుడు, కేదార్ జాదవ్, భువనేశ్వర్ లకు జట్టులో స్థానం లబించింది.

టీమిండియా సభ్యులు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), ధోనీ (కీపర్), కేఎల్ రాహుల్, అంబటి రాయుడు, మనీష్ పాండే, కేదార్ జాదవ్, దినేష్ కార్తీక్ (కీపర్), కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్.

More Telugu News