Asian Games-2018: ఏషియన్స్ గేమ్స్ లో భారత్ పసిడి ‘పంచ్’.. ఒలింపిక్ విజేతను ఓడించిన పంగల్!

  • అదరగొట్టిన భారత బాక్సర్
  • ఒలింపిక్ ఛాంపియన్ పై విజయం
  • 66కు చేరుకున్న భారత పతకాలు

ఇండోనేషియాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. తాజాగా 49 కేజీల బాక్సింగ్ విభాగంలో భారత ఆటగాడు అమిత్ పంగల్ బంగారు పతకాన్ని సాధించాడు. ఈ రోజు జరిగిన పోటీలో ఒలింపిక్ ఛాంపియన్, ఉజ్బెకిస్తాన్ బాక్సర్ హసన్ బోయ్ దుమత్సోవ్ పై 3-2 తేడాతో పంగల్ విజయం సాధించాడు. తాజా విజయంతో భారత్ పతకాల సంఖ్య 66కు చేరుకుంది. ఇందులో 14 స్వర్ణాలు, 23 రజతాలు, 29 కాంస్య పతకాలు ఉన్నాయి.

More Telugu News