mahesh: విదేశాలకి 'మహర్షి' .. రెండు నెలల పాటు ఏకధాటిగా షూటింగ్

  • తదుపరి షెడ్యూల్ విదేశాల్లో 
  • కీలక సన్నివేశాలు .. పాటల చిత్రీకరణ 
  • ఉగాది కానుకగా సినిమా విడుదల

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా రూపొందుతోంది. మహేశ్ బాబు 25వ సినిమాగా ఇది నిర్మితమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. కొన్ని రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తూ వస్తున్నారు. తదుపరి షెడ్యూల్ ను అమెరికా .. న్యూయార్క్ .. కేలిఫోర్నియా .. లాస్ వెగాస్ లలో ప్లాన్ చేశారు.

సెప్టెంబర్ 2వ వారంలో అక్కడ షూటింగ్ మొదలుకానుంది. 2 నెలల పాటు ఏకధాటిగా అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను .. నాయకా నాయికలపై రొమాంటిక్ సాంగ్స్ ను చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంఖ్యా పరంగా ఈ సినిమా మహేశ్ కి ప్రత్యేకం కావడంతో, వంశీ పైడిపల్లి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. అశ్వనీదత్ .. దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను, 'ఉగాది' కానుకగా ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.      

More Telugu News