sumanth: రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న 'ఇదం జగత్'

  • 'ఇదం జగత్' పూర్తిచేసిన సుమంత్ 
  • నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్ర 
  • వచ్చేనెల 28వ తేదీన విడుదల    

గతంలో కంటే సుమంత్ ఇటీవల దూకుడు పెంచాడనే చెప్పాలి. ప్రస్తుతం 'సుబ్రహ్మణ్య పురం' .. 'ఎన్టీఆర్' బయోపిక్ లో ఆయన నటిస్తున్నాడు. ఇక ఈ రెండింటి కంటే ముందుగా ఆయన 'ఇదం జగత్' అనే సినిమాను పూర్తి చేశాడు. అనీల్ శ్రీకంఠం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో, సుమంత్ సరసన అంజూ కురియన్ కథానాయికగా నటించింది.

పద్మావతి .. శ్రీధర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను, వచ్చేనెల 28వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఇంతవరకూ సుమంత్ సాఫ్ట్ గా వుండే పాత్రలను చేస్తూ వచ్చాడు. మొదటిసారిగా ఈ సినిమాలో ఆయన నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రను చేయడం విశేషం. అదే ఈ సినిమాకి మరింత ప్రత్యేకత కానుంది. కొత్త కంటెంట్ తో .. విభిన్నమైన పాత్రతో వస్తోన్న సుమంత్ కి ఈ సారైనా హిట్ పడుతుందేమో చూడాలి.

More Telugu News