rambha: రాజమండ్రి రంభ, ఊర్వశి థియేటర్లలో చెలరేగిన మంటలు

  • రంభ, ఊర్వశి థియేటర్లలో అగ్ని ప్రమాదం
  • పరుగులు తీసిన ప్రేక్షకులు
  • మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది

రాజమండ్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని రంభ, ఊర్వశి థియేటర్లలో మంటలు చెలరేగాయి. ఈ సందర్భంగా తీవ్ర భయాందోళనలకు గురైన ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది... హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అగ్నిప్రమాదం నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారీ సంఖ్యలో ప్రజలు గుమికూడారు. ట్రాఫిక్ జామ్ అయింది. 

More Telugu News