Shahrukh Khan: షారుఖ్ కుమారుడితో జోడీ కట్టనున్న శ్రీదేవి రెండో కుమార్తె?

  • ఒకే సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వనున్న ఆర్యన్, ఖుషీ కపూర్
  • సన్నాహకాల్లో కరణ్ జొహార్
  • ఇప్పటికే జాన్వీని బాలీవుడ్ కు పరిచయం చేసిన కరణ్

బాలీవుడ్ లో ఇద్దరు స్టార్ కిడ్స్ తెరంగేట్రం చేస్తున్నట్టు సమాచారం. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్, శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ జంటగా ఓ సినిమా తెరకెక్కబోతోందనేది బీటౌన్ టాక్. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే ఇప్పటికే వీరిద్దరికీ ఫుల్ క్రేజ్ ఉంది. వీరికి సంబంధించిన ఎన్నో వార్తలు మీడియాలో ప్రత్యక్షమవుతుంటాయి.

ఈ నేపథ్యంలో వీరిద్దరిని ఒకే సినిమాతో వెండితెరకు పరిచయం చేయాలని దర్శకనిర్మాత కరణ్ జొహార్ భావిస్తున్నాడట. కథను రెడీ చేసే బాధ్యతను ఇప్పటికే కొందరు రచయితలకు అప్పజెప్పాడట. ఇప్పటికే శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ 'ధడక్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాను నిర్మించింది కూడా కరణ్ జొహారే. దీంతో, తన రెండో కుమార్తె బాధ్యతను కూడా అతనికే బోనీ కపూర్ అప్పగించారని సమాచారం.

More Telugu News