Palnadu: స్నేహితుడి భార్యతో సంబంధం... హత్యకు దారితీసింది... ఏడాది తరువాత దొరికిన నిందితుడు!

  • గత సంవత్సరం అక్టోబర్ లో పల్నాడు ప్రాంతంలో మృతదేహం
  • మృతుడి భార్యతో నిందితుడికి వివాహేతర బంధం
  • ప్రశ్నిస్తున్నాడని హత్య... ఏడాది గాలించి అరెస్ట్ చేసిన పోలీసులు

దాదాపు ఏడాది క్రితం పల్నాడు ప్రాంతంలో లభ్యమైన ఓ హైదరాబాద్ వాసి మృతదేహం కేసు ఇప్పటికి తేలింది. తన భార్యతో వివాహేతర బంధం నడుపుతున్నాడన్న ఆగ్రహంతో అతని స్నేహితుడే ఈ హత్యను చేశాడని గురజాల పోలీసులు తేల్చారు. డీఎస్పీ ప్రసాద్ వెల్లడించిన వివరాల మేరకు, దుర్గి మండలం ధర్మవరం వద్ద గతేడాది అక్టోబర్ 20న ఓ మృతదేహం లభ్యమైంది.

అక్కడ లభించిన పుస్తకంలోని ఫోన్ నంబర్ల ద్వారా హైదరాబాద్ లో ఉంటున్న భూక్యా వెంకటరాం అని గుర్తించారు. కేసు విచారణను ప్రారంభించగా, వారికి విస్తుపోయే నిజాలు తెలిశాయి. వెంకటరాంకు వెంకటేశ్ అనే స్నేహితుడు ఉండగా, ఇద్దరూ కలసి తాపీ పనులు చేస్తుండేవారు. ఈ క్రమంలో వెంకటరాం భార్య జ్యోతికి, వెంకటేష్ కు పరిచయం ఏర్పడింది. జ్యోతి ఇల్లు వదిలి వెళ్లడంతో తన భార్యను నువ్వే ఎక్కడో ఉంచావంటూ వెంకటేష్ తో గొడవ పెట్టుకున్నాడు. దీంతో ఎలాగైనా వెంకటరాంను వదిలించుకోవాలన్న ఉద్దేశంతో అతనికి మద్యం తాగించి, రాయితో తలపై మోది హత్య చేసి పారిపోయాడు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న అతడిని నాగార్జున సాగర్ లో గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు.

More Telugu News