Jaya: జయ మరణ వార్త విని కృష్ణ, విజయనిర్మల దిగ్భ్రాంతికి గురయ్యారు: నటుడు నరేష్

  • నిన్న రాత్రి మరణించిన దర్శకురాలు జయ
  • ఈ ఉదయం కృష్ణకు వార్త చెప్పిన కుటుంబీకులు
  • షాక్ నకు గురయ్యారన్న నరేష్

దర్శకురాలు బి. జయ హఠాన్మరణ వార్తను విని కృష్ణ, విజయనిర్మల దిగ్భ్రాంతికి గురయ్యారని నటుడు నరేష్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం బీఏ రాజు ఇంటికి వచ్చి జయ భౌతికకాయం వద్ద నివాళులు అర్పించిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ, ఈ ఉదయం కృష్ణకు విషయం తెలిసిందని, ఆ వెంటనే ఆయన షాక్ నకు గురయ్యారని చెప్పారు. బీఏ రాజు కుటుంబానికి, ఘట్టమనేని కుటుంబానికీ ఎంతో దగ్గర అనుబంధముందని, తనకు ఓ సోదరి లాంటి జయ మరణవార్తను జీర్ణించుకోలేక పోతున్నానని అన్నారు. ఇండస్ట్రీకి ఆమె మరణం తీరని లోటని, ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.

More Telugu News