Chandrababu: చంద్రబాబుతో భేటీ అయిన కర్ణాటక సీఎం కుమారస్వామి

  • విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన కుమారస్వామి
  • గేట్ వే హోటల్ లో సమావేశమైన ముఖ్యమంత్రులు
  • ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పిన సీఎంవో

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కర్ణాటక సీఎం కుమారస్వామి భేటీ అయ్యారు. విజయవాడలోని గేట్ వే హోటల్ లో వీరిద్దరూ సమావేశమయ్యారు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు కుమారస్వామి విజయవాడకు వచ్చేశారు. ఈ సందర్భంగా కుమారస్వామిని చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు కూడా పాల్గొన్నారు. ఇది కేవలం ఆత్మీయ సమావేశమే తప్ప, ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. 

More Telugu News