hari krishna: చితిపై హరికృష్ణ భౌతికకాయం.. ప్రారంభమైన అంత్యక్రియలు

  • చితిపైకి చేరిన హరి భౌతికకాయం
  • చితికి నిప్పు పెట్టనున్న కల్యాణ్ రామ్
  • విచారం వదనంలో కుటుంబసభ్యులు, అభిమానులు

అశ్రునయనాల మధ్య నందమూరి హరికృష్ణ అంత్యక్రియల ఘట్టం ప్రారంభమైంది. ఆయన పార్థివదేహాన్ని చితిపై ఉంచారు. చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బాలకృష్ణ, లోకేష్, తారక్, కల్యాణ్ రామ్ ఇతర కుటుంబసభ్యులంతా విచార వదంనంతో నిలబడ్డారు. కాసేపట్లో కల్యాణ్ రామ్ తన తండ్రి చితికి నిప్పు పెట్టనున్నారు. తెలంగాణ పోలీసులు గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరిపి, వందనం అర్పించనున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, నన్నపునేని రాజకుమరి, టీడీపీ మంత్రులు, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులంతా అక్కడే ఉన్నారు.


More Telugu News