akhilapriya: ఘనంగా అఖిలప్రియ వివాహం.. హరికృష్ణ మరణంతో హాజరుకాలేని నేతలు!

  • భార్గవరామ్ తో వైభవంగా అఖిలప్రియ వివాహం
  • హరికృష్ణ మరణంతో హాజరుకాలేని చంద్రబాబు
  • వధూవరులను ఆశీర్వదించిన మంత్రులు నారాయణ, కాల్వ

భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల కుమార్తె, ఏపీ మంత్రి అఖిలప్రియ వివాహం ఆళ్లగడ్డలో ఈరోజు ఘనంగా జరిగింది. పారిశ్రామికవేత్త భార్గవరామ్ తో వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి పలువురు రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు హాజరు కావాల్సి ఉంది. కానీ, నందమూరి హరికృష్ణ హఠాన్మరణంతో ఎవరూ ఈ వివాహానికి హాజరు కాలేకపోయారు. షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వివాహానికి హాజరుకావాలి. మరోవైపు, మంత్రులు కాల్వ శ్రీనివాసులు, నారాయణలు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. బంధు మిత్రుల సమక్షంలో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది.

More Telugu News