West Bengal: బాలీవుడ్ పాటకు మహిళా టీచర్ల కుప్పిగంతులు.. ఇంటర్నెట్ లో వీడియో వైరల్!

  • పశ్చిమ బెంగాల్ లో ఘటన
  • విద్యార్థుల ముందే టీచర్ల ధూమ్ ధామ్
  • ఇంటర్నెట్ లో పోస్ట్ చేసిన విద్యార్థులు

ఉపాధ్యాయులంటే హూందాగా ఉండాలి. కానీ పశ్చిమబెంగాల్ లోని కొందరు మహిళా టీచర్లు మాత్రం దీనికి నీళ్లొదిలారు. బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ నటించిన ‘యే జవానీ హై దివానీ’లో ఓ పాటకు కుప్పిగంతులు వేస్తూ ఎంజాయ్ చేశారు. స్కూల్ లో కొందరు పిల్లలు కింద డ్యాన్స్ చేస్తుంటే.. ఈ టీచర్లు కొంచెం ఎత్తుగా ఉన్న ప్రాంతంపై  ఇష్టానుసారం గంతులేశారు. పశ్చిమబెంగాల్ లోని అలీపూర్దువార్ లో ఉన్న ఓ పాఠశాలలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

కొందరు విద్యార్థులు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. కాగా, మహిళా టీచర్ల డ్యాన్స్ పై మిశ్రమ స్పందన వస్తోంది. దీన్ని కొందరు సమర్ధిస్తుండగా.. చిన్నపిల్లల ముందు ఈ కుప్పిగంతులు ఏంటని మరికొందరు మండిపడుతున్నారు.


More Telugu News