harikrishna: ఇంటికి చేరుకున్న హరికృష్ణ పార్థివదేహం.. కాసేపట్లో రానున్న కేసీఆర్

  • మెహిదీపట్నంలోని నివాసానికి చేరుకున్న హరి పార్థివదేహం
  • ఇంట్లోకి వెళ్లిన చంద్రబాబు
  • కాసేపట్లో నివాళి అర్పించనున్న కేసీఆర్

దివంగత హరికృష్ణ పార్థివదేహం హైదరాబాద్ మెహిదీపట్నంలో ఉన్న నివాసానికి చేరుకుంది. కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిలు ఆయన భౌతికకాయాన్ని అంబులెన్సులో నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఇంటి లోపలకు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, బాలకృష్ణ, నారా లోకేష్ తదితరులంతా ఇంట్లోకి వెళ్లారు. ఇంటి వద్ద బంధుమిత్రులంతా తీవ్ర విషాదంలో ఉన్నారు. మరోవైపు, ఇంటి వద్ద భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడకు చేరుకుని, హరికృష్ణకు నివాళి అర్పించనున్నారు.

More Telugu News