akhil: అఖిల్ ఫస్టులుక్ .. చైతూ ట్రైలర్ రిలీజ్ లు ఆగిపోయాయి

  • అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి మూవీ 
  • పరిశీలనలో 'మిస్టర్ మజ్ను' టైటిల్
  • చైతూ హీరోగా 'శైలజా రెడ్డి అల్లుడు' 

అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఈ సినిమాకి 'మిస్టర్ మజ్ను' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఈ రోజున నాగార్జున పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేయాలని భావించారు. కానీ నందమూరి హరికృష్ణ చనిపోవడం వలన, నాగ్ తన బర్త్ డే వేడుకలను రద్దు చేసుకున్నారు .. అఖిల్ ఫస్టులుక్ రిలీజ్ ఆలోచనను విరమించుకున్నారు.ఇక ఈ రోజున 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, చైతూ సరసన కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ నటించింది. నందమూరి హరికృష్ణ హఠాన్మరణం కారణంగా, ట్రైలర్ విడుదలను వాయిదా వేసుకున్నారు. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులకి సంబంధించిన కొత్త తేదీలను ఎనౌన్స్ చేయనున్నారు. 

More Telugu News