harikrishna: మేనమామ హరికృష్ణ గురించి నారా లోకేష్ ఏం చెప్పారంటే..!

  • మామయ్య గొప్ప మానవతావాది
  • తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేవారు
  • ఆయన మరణం తీరని లోటు

కామినేని ఆసుపత్రిలో తన మేనమామ హరికృష్ణ భౌతికకాయాన్ని చూసిన మంత్రి నారా లోకేష్ కంటతడి పెట్టారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయన భౌతికకాయంపై పూలమాలను ఉంచి, నివాళి అర్పించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, హరికృష్ణ గొప్ప మానవతావాది అని చెప్పారు. ఏ విషయమైనా సరే తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు, నిర్మొహమాటంగా చెప్పేవారని తెలిపారు. ఆయన మరణం తమ కుటుంబానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. 

More Telugu News