vishal: వాయిదాపడిన 'పందెం కోడి 2' టీజర్ రిలీజ్

  • లింగుస్వామి దర్శకుడిగా 'పందెం కోడి 2'
  • విశాల్ సరసన కీర్తి సురేశ్ 
  • దసరాకి ప్రేక్షకుల ముందుకు

విశాల్ హీరోగా 'పందెం కోడి 2' సినిమా నిర్మితమైంది. లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేష్ నటించింది. దసరా కానుకగా అక్టోబర్ 12వ తేదీన తమిళ .. తెలుగు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకి ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నట్టు నిన్న ప్రకటించారు.

అయితే ఈ రోజు ఉదయం నందమూరి హరికృష్ణ చనిపోవడంతో, చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. అందువలన దర్శకనిర్మాతలు టీజర్ రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ టీజర్ ను ఎప్పుడు విడుదల చేసేది త్వరలోనే ప్రకటించనున్నారు. తెలుగులో మాస్ హీరోగా విశాల్ కి మంచి ఇమేజ్ వుంది. ఇక కీర్తి సురేశ్ కి కూడా ఇక్కడ ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. అందువలన ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది. 

More Telugu News