harikrishna: రేపు హరికృష్ణ అంత్యక్రియలు.. కుమారుడికి జరిగిన చోటే!

  • మొయినాబాద్ ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు
  • జానకిరామ్ కు జరిగిన ప్రాంతంలోనే అంతిమ సంస్కారం
  • కొనసాగుతున్న పోస్ట్ మార్టం

దివంగత నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. హైదరాబాద్ మొయినాబాద్ లో ఉన్న ఫామ్ హౌస్ లో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఆయన పెద్ద కుమారుడు జానకిరామ్ అంత్యక్రియలు జరిగిన చోటే హరికృష్ణ అంతిమ సంస్కారం కూడా జరగనుంది. హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురైన ప్రాంతానికి సమీపంలోనే జానకిరామ్ కూడా రోడ్డు ప్రమాదానికి గురై, మరణించిన సంగతి తెలిసిందే.

ఫామ్ హౌస్ లో అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రిలో ఆయన మృత దేహానికి పోస్ట్ మార్టం జరుగుతోంది. ఆ తర్వాత భౌతికకాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్ లో ఈ మధ్యాహ్నం ఆయన భౌతికకాయాన్ని కాసేపు ఉంచి, ఘన నివాళి అర్పించనున్నారు.

More Telugu News