parashuram: గీత గోవిందం' దర్శకుడి నెక్స్ట్ మూవీ .. హీరోకి - దేవుడికి మధ్య నడిచే కథ!

  • 'గీత గోవిందం' భారీ హిట్ 
  • నెక్స్ట్ మూవీ గీతా ఆర్ట్స్ లోనే 
  • స్క్రిప్ట్ పనుల్లో దర్శకుడు  

పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గీత గోవిందం' భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. దాంతో ఆయనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు చాలామంది ఉత్సాహాన్ని చూపుతున్నారు. అయితే ఆయన మాత్రం గీతా ఆర్ట్స్ లోనే మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. దాంతో ఈ సినిమా కథ ఏమై వుంటుందనే కుతూహలంతో చాలామంది వున్నారు.

 హీరోకి .. దేవుడికి మధ్య జరిగే కథాకథనాలతో ఈ సినిమా రూపొందనున్నట్టు పరశురామ్ చెబుతున్నాడు. గురువు రూపంలో హీరోని దేవుడు నడిపిస్తూ వుండే కథగా ఇది నిర్మితం కానుంది. అయితే ఇది 'ఢమరుకం' .. 'గోపాల గోపాల' తరహాలో మాత్రం ఉండదు. అలాగని సోషియో ఫాంటసీ మాదిరిగా కూడా వుండదు. నిర్మాత బన్నీవాసుకు ఈ కథ బాగా నచ్చింది. కథ పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాక నటీనటుల గురించిన ఆలోచన చేస్తామని చెప్పుకొచ్చాడు.    

More Telugu News