Pawan Kalyan: గాయాలు మాత్రమే అనుకున్నా... అంతలోనే ఇంత దుర్వార్తా?: పవన్ కల్యాణ్

  • దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పవన్
  • నేటి జనసేన అధికారిక కార్యక్రమాలు రద్దు
  • సినీ రాజకీయ రంగాల్లో ఆయన సేవలు మరవరానివన్న పవన్

టీడీపీ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మరణంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ లేఖను పెడుతూ, నేటి జనసేన అధికారిక కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. హరికృష్ణ ప్రమాదానికి గురయ్యారని తెలియగానే గాయాలతో బయటపడతారని భావించానని, ఆ వెంటనే విషాద వార్త వినాల్సి వచ్చిందని పవన్ వ్యాఖ్యానించారు.

 సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు మరచిపోలేనివని వ్యాఖ్యానించిన పవన్, హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ విషాద సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్లే శక్తిని ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ఇవ్వాలని, తన తరఫున, జనసేన శ్రేణుల తరఫున ఆయనకు నివాళులు అర్పిస్తున్నానని అన్నారు.

More Telugu News