Chandrababu: చంద్రబాబు కోసం ఆగిన హరికృష్ణ పోస్ట్ మార్టం!

  • పోస్ట్ మార్టంకు సిద్ధమైన వైద్యులు
  • చంద్రబాబు వస్తున్నారన్న సమాచారంతో పోస్ట్ మార్టంను ఆపేసిన డాక్టర్లు
  • కాసేపట్లో ప్రారంభంకానున్న పోస్ట్ మార్టం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి చేరుకున్నారు. ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తన బావమరిది నందమూరి హరికృష్ణ భౌతికకాయాన్ని ఆయన దర్శించుకున్నారు. మరోవైపు, ఇప్పటి వరకు హరికృష్ణ మృత దేహానికి పోస్ట్ మార్టం ప్రారంభంకాలేదు. పోస్ట్ మార్టం నిర్వహించేందుకు వైద్యులు సిద్ధమైనప్పటికీ... చంద్రబాబు వస్తున్నారన్న సమాచారంతో పోస్ట్ మార్టంను వైద్యులు ప్రారంభించలేదు. కాసేపట్లో పోస్ట్ మార్టంను నిర్వహించనున్నారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తారు. 

More Telugu News